రాహుల్‌ సర్టిఫికెట్‌ అక్కర్లేదు: కుమారస్వామి

బెంగళూరు,మే10(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై జనతా దళ్‌ (సెక్యులర్‌) అగ్రనేత కుమార స్వామి ఘాటుగా స్పందించారు. తమ పార్టీకి రాహుల్‌ గాంధీ సర్టిఫికేట్‌ అక్కర్లేదన్నారు. జేడీఎస్‌కు ఉన్న లౌకికవాద గుర్తింపు గురించి రాహుల్‌ గాంధీ కానీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కానీ సర్టిఫికేట్‌ ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థాయిలో ప్రజలు తమ పార్టీకి మద్దతిస్తారన్నారు. రాహుల్‌ గాంధీ సోమవారం కోలార్‌ సవిూపంలోని మాలూర్‌లో మాట్లాడుతూ జేడీఎస్‌పై విరుచుకుపడ్డారు. జేడీఎస్‌ ఎటువైపు ఉంటుందో చెప్పాలన్నారు. సెక్యులర్‌ కాంగ్రెస్‌ వైపా? మతతత్త్వ సంఘ్‌ పరివార్‌వైపా? చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కుమారస్వామి మండిపడ్డారు. ఎవరికి వారు గొప్పలు చెప్పుకోవడం పరిపాటిగా మారిందన్నారు.