రిటైర్డ్ ఆర్మీ సైనికులకు సన్మానం

మల్దకల్ సెప్టెంబర్ 1 (జనంసాక్షి) మండల పరిధిలోని మద్దెలబండ గ్రామంలో విశ్వహిందూ పరిషత్ -ధర్మప్రసారసమితి కమిటీ ఆధ్వర్యంలో గురువారం రిటైర్డ్ ఆర్మీ సైనికులకు విశ్వహిందూపరిషత్ మెమొంటో,శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మద్దెలబండగ్రామ సర్పంచ్ కొత్తింటి జయమ్మ, వైస్ఎంపీపీ పెద్ద వీరన్న, మల్దకల్ ఎస్సై ఆర్ శేఖర్,విశ్వహిందూపరిషత్ జిల్లా సంయోజక్ జగదీశ్వర్ రెడ్డి,గ్రామ పెద్దలు, వివిధ వినాయక మండపాలయువత, విశ్వహిందూపరిషత్ కార్యకర్తలు,పాల్గొన్నారు.