రెండవ రోజు విజయలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనం

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 27 మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో దేవి శరన్య నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం శ్రీజ్ఞాన సరస్వతిదేవికి విజయలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళగౌరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని యాక్తాపురం, కొండపేట, ఎర్రవల్లి చౌరస్తా, షేక్ పల్లి, కొండేరు, జింకలపల్లి, కోదండపురం తదితర గ్రామాల నుంచి భక్తులు బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకొని వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.