రెతులు పిఎం కిసాన్ ఈ- కేవైసి ని సద్వినియోగం చేసుకోవాలి…వ్యవసాయ సంచాలకులు

కె. శ్రీపాల్,మండల వ్వవసాయాధికారి ఎం.కల్యాణి
వెంకటాపూర్ (రామప్ప)ఆగస్ట్27(జనం
వెంకటాపూర్
 మండలంలోని వ్యవసాయ
విస్తరణ అధికారులు
సర్వేనెంబర్ల వారిగా అంతర్జాలలలో నమోదు చేసిన పంటల వివరాలను ములుగు సహాయ వ్యవసాయ సంచాలకులు కె. శ్రీపాల్, మండల వ్వవసాయాధికారి ఎం.కల్యాణి పరిశీలించడం జరిగింది.ఇందులో భాగంగా
రెతు వేదికను తనిఖి చేశారు.పిఎం కిసాన్ లబ్దిదారులు ఈ నెల 31 వ తేది లోపు వివరాలు సమీప కామన్ సర్వీస్ సెంటర్ లలో  లేదా మీ సేవ లలో నమోదు చేసుకోవాలని తెలిపారు. లేనియెడల పిఎం కిసాన్ లబ్ధిదారులకు డబ్బులు వారి ఖాతాలలో జమకావు అని తెలిపారు. ఈకార్యక్రమంలో లక్ష్మీదేవిపేట సర్పంచ్ గట్టు కుమారస్వామి, వ్వవసాయ విస్తరణ అధికారి పాల్గొన్నారు.