రేప్‌ కేసులో నిందితుడికి ఏడేళ్ల శిక్ష

డెహ్రడూన్‌ (ఉత్తరాఖండ్‌) : మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కాషియాపూర్‌ స్థానిక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మొరదాబాద్‌ కు చెందిన మనీష్‌ షైని గతేడాది అక్టోబర్‌ లో పాఠశాల నుంచి మైనర్‌ బాలికను అపహరించి అత్యచారం చేశాడు. దోషిగా తేలిన మనీష్‌కు జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధించింది.