రైతులను రెచ్చగొట్టవద్దు

` అర్హులందరికీ రుణమాఫీ
` సీఎం రేవంత్‌ హామీ
హైదరాబాద్‌(జనంసాక్షి): రైతుల ముసుగులో బీఆర్‌ఎస్‌ ధర్నాలు చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఏ రైతుకు మాఫీ కాకున్నా..కలక్టర్‌ కార్యాలయంలో కౌంటర్‌ పెట్టిన. 18 వేల కోట్లు రైతుల ఖాతాలో వేశాం. కేటీఆర్‌? తప్పుడు మాటలు మానుకో మాది ప్రజా పాలన రైతులకు..ప్రజలకు అందుబాటులో ఉన్నాం. రోజూ మేము 18 గంటలు ప్రజల మధ్యనే ఉంటున్నాం. ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది. ప్రజల్ని పట్టించుకోకుండా ఉన్నారు విూరు. కాకుల లెక్క.. గద్దల లెక్క పిక్కుతున్నది వీళ్లే కదా. కేటీఆర్‌..హరీష్‌ లాంటి సన్నాసులు కదా మిమ్మల్ని దోచుకుంది. వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్నారు. పదేళ్లలో విూరు ఎంత మాఫీ చేశారు.. మేము ఎంత చేశామో చర్చకు సిద్దం. నెక్టు మా జగ్గన్న నే చూసుకుంటారు. సోషల్‌ విూడియా నీ నమ్ముకున్న మోడీ ఏమయ్యారు. విూరు అంతే ఐతరు 400 గెలుస్త అని మోడీ ప్రచారం చేసుకున్నారు.. ఏమైంది. వచ్చే ఎన్నికల్లో 39 లో 9 కూడా రావు’ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇకపోతే రూ.2 లక్షల రుణమాఫీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం వందశాతం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ సన్నాసుల మాటలు నమ్ముకొని రైతులు ఆగం కావద్దని సూచించారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కొన్ని సాంకేతిక కారణాలతో కొందరికి మాత్రమే రుణాలు మాఫీ జరగలేదని, త్వరలోనే పూర్తిగా రుణాలు మాఫీ అవుతాయని పేర్కొన్నారు. ఏ ఒక్కరికి రుణం మాఫీ కాకపోయినా.. ఇక్కడ తాము ఉన్నామన్న విషయాన్ని మర్చిపోవద్దని కోరారు. ’ఏ రైతుకి రుణమాఫీ రాకపోయినా మేం ఉన్నాం. కలెక్టర్‌ ఆఫీసుల్లో కుర్చీ వేసి ఆఫీసర్లను కూర్చోబెట్టాం. రైతు విషయంలో కొందరు దొంగ దీక్షలు చేస్తున్నారు. రైతులకు రోడ్డెక్కాల్సిన బాధ ఏమొచ్చింది? సన్నాసులను నమ్ముకొని ఆగం కావద్దు. రైతుల సమస్యలు విననప్పుడు ధర్నాలు చేయాలి. విూ సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తొందర పడొద్దని కర్షక సోదరులను కోరుతున్నాం. రైతుల సమస్యను ప్రభుత్వం వింటుంది. పదేళ్లు దోచుకున్న వాళ్లను, ఆరునెలల కింద బొంద పెట్టిన వారిని మళ్ళీ గ్రామాల్లోకి ఎందుకు రానిస్తున్నారు. రుణమాఫీ హావిూ అమలు చేయడంతో హరీశ్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని ఇవాళ కొత్త డ్రామా మొదలు పెట్టారని మండిపడ్డిపడ్డారు. డ్రామాలో భాగంగానే దేవాలయాల వద్ద నిరసనలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు సోషల్‌ విూడియాలో అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. వారిపట్ల ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. రుణమాఫీ చేయడంతో బీఆర్‌ఎస్‌ నేతలకు ఏం చేయాలో పాలుపోవట్లేదు. దీంతో అబద్దాలకు తెరతీశారు. కేటీరామారావు రుణమాఫీ విషయంలో పచ్చి అబద్దాలు చెబుతున్నారు. వారు రూ.లక్ష రుణం మాఫీ చేయడానికే ఆపసోపాలు పడ్డారు. అప్పటికీ అందరికీ పూర్తి చేయలేదు. కానీ మేం ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణాలను మాఫీ చేశాం’ అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.