రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

ఖమ్మం, మార్చి 25: ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం పట్టణంలో సంచలనం సృష్టించింది. ఈ బుధవారం ఉదయం సారథి నగర్‌ దగ్గర ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతులు వరంగల్‌ జిల్లాకు చెందిన బీటెక్‌ విద్యార్థులు కిరణ్మయి, సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి మార్చురీకి తరలించారు.