రైలు ప్రయాణంలో ప్రధాని, సోనియా

శ్రీనగర్‌: జమ్మూలోని బనిహాల్‌ నుంచి కాశ్మీర్‌లోని కాజీగుండ్‌ల మధ్య రైలును ప్రారంభించిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ రైలులో ప్రయాణించారు. 18 కి.మీ. పొడవైన ఈ రైలు మార్గంలో అసియాలోనే రెండో పొడవైన సొరంగ మార్గం (11కి.మీ.) ఉండడం విశేషం.