రైల్వే మంత్రి బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభం

ఢిల్లీ : రైల్వే మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ 2013 బడ్జెట్‌ ప్రసంగాన్ని లోక్‌సభలో చదవటం ప్రారంభించారు. తనకీ అవకాశాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి బన్సల్‌ కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని ఐక్యం చేసే విషయంలో రైల్వేలది కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు.