రోటరీ క్లబ్ లో వరంగల్ తూర్పు మున్నూరు కాపు బాధ్యుల సమావేశం

రోటరీ క్లబ్ లో వరంగల్ తూర్పు మున్నూరు కాపు బాధ్యుల సమావేశం

వరంగల్ ఈస్ట్ అక్టోబర్ 18
(జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని అండర్ రైల్వే గేట్ రోటరీ క్లబ్ లో మంగళవారం రాత్రి వరంగల్ తూర్పు మున్నూరు కాపు సమన్వయకర్త పోతు కుమారస్వామి ఆధ్వర్యంలో మున్నూరు కాపు కుల బాధ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వరంగల్ తూర్పు మున్నూరు కాపుల భవనం కోసం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ 4200 గజాల స్థలాన్ని దేశయీపేటలో కేటాయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మున్నూరు కాపులంతా ఐక్యంగా ఉండడం వలన ఇది సాధ్యమైందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఖిలా వరంగల్ పిఎసిఎస్ చైర్మన్, కేడల జనార్ధన్, మేడిది మధుసూదన్, పెంచాల గోపన్న, తోట తిరుపతయ్య, గడ్డం రమేష్, పల్లం రవి, ఒగిలి శెట్టి అనిల్, కామిశెట్టి కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు