లంబాడ లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి…

బేల, సెప్టెంబర్ 30 ( జనం సాక్షి) చట్ట బద్ధత  లేని లంబాడ లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం  మండలము లోని చాంద్ పెల్లి గ్రామము లో తుడుం దెబ్బ రాయి సెంటర్ అద్వర్యములో నిరసన దీక్ష  చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్  కోరంగే జంగషౌ, రాయి సెంటర్ అధ్యక్షుడు కొరంగే సోనేరావు,కొడప భీం రావ్,దౌలత్ రావ్ గ్రామస్తులు  తదితరులు పాల్గొన్నారు.