లభ్యం కాని 430 మంది తెలుగువారి ఆచూకీ

ఉత్తరాఖండ్‌: చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన వారిలో 430 మంది తెలుగువారి ఆచూకి లభ్యం కాలేదని సహాయ పునరావాస కమిషనర్‌ రాధ తెలిపారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు రాష్ట్రం నుంచి 2,616 మంది చారాధామ్‌ వెళ్లినట్లు చెప్పారు. వారిలో 1,239 మంది స్వస్థలాలకు చేరుకున్నారని, 933 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నట్లు వివరించారు.