లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర కొనసాగుతున్నది. స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 29,361 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 8901 వద్ద ముగిశాయి. శనివారం సాధారణంగా మార్కెట్లకు సెలవైనా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా ఈరోజు ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించారు