లాలూకు తాత్కాలిక బెయిల్‌

రాంచీ,మే11(జ‌నం సాక్షి ):  బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్టీయ్ర జనతా దళ్‌ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు తాత్కాలిక బెయిలు మంజూరైంది. అనారోగ్యం, వైద్య కారణాల మేరకు ఆరు వారాల తాత్కాలిక బెయిలును రాంచీ హైకోర్టు మంజూరు చేసింది. దాణా కుంభకోణం కేసుల్లో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం తన కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ వివాహానికి హాజరయ్యేందుకు మూడు రోజుల పెరోల్‌పై విడుదలయ్యారు. గురువారం సాయంత్రం ఆయన పాట్నా చేరుకున్నారు. శిర్సాముందా జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.