లా క్‌డౌన్‌పై నేడు నిర్ణయం

 జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

– దిల్లీ, ఏప్రిల్ 13(జనంసాక్షి): దేశంలో ముగియనున్న లా డౌన్ కొనసాగిం పుపై రేపే స్పష్టత రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉదయం

లాక్ డౌన్ పై నేడు నిర్ణయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ ప్రసంగంలో లా డౌన్ పొడిగింపుపై ప్రకటన చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో లా డౌన్ పొడిగించాలంటూ ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాలు లాక్ డౌనను ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి దేశాన్ని మూడు జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. నమోదైన కేసుల ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా గుర్తించాలని కేంద్రం భావిస్తోంది. ఏప్రిల్ 15 తర్వాత మరో రెండు వారాల పాటు కొవిడ్-19ను దీటుగా ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.