వంతెనపై నుంచి పడ్డ ట్రక్కు: ఏడుగురు దుర్మరణం
అహ్మదాబాద్,జూన్23(జనం సాక్షి): గుజరాత్లోని అమ్రేలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భావ్నగర్-సోమనాథ్ రహదారి సవిూపంలో వంతెనపై నుంచి ట్రక్కు అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 24 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. క్షతగాత్రులను సవిూపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అమ్రేలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.