వజ్రోత్సవాలలో అందరూ భాగస్వామ్యం కావాలి

ఎస్సై ఆర్ శేఖర్

మల్దకల్ ఆగస్టు 10 (జనంసాక్షి) వజ్రోత్సవాలలో అందరూ భాగస్వామ్యం కావాలని మల్దకల్ ఎస్సై ఆర్ శేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారము వన మహోత్సవం సందర్భంగా ఎస్సై తో పాటు సిబ్బంది కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత్ స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఒక్కరూ దేశభక్తి భావన స్వతంత్ర పోరాట స్ఫూర్తి మేలుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈనెల 15వ జాతీయ జెండాలను ప్రతి ఇంటి వద్ద ఎగురవేయాలని, వజ్రోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.నాటి త్యాగాల స్ఫూర్తి ఫలితంగానే స్వతంత్రం సాధించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది స్వాములు ,ఎల్లప్ప, నిరంజన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.