వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మార్పు ?

7

వరంగల్ : జిల్లా ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన సిరిసిల్ల రాజయ్య ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనలో పడింది. బుధవారం ఉదయం సిరిసిల్ల రాజయ్య నివాసంలో జరిగిన అనుమానాస్పదస్థితిలో కోడలు, ముగ్గురు మనవళ్లు దుర్మరణం చెందారు. అగ్నిప్రమాదం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే వరంగల్ ఎంపీ స్థానానికి నామినేషన్ లు వేసేందుకు చివరి రోజు కావడంతో రాజయ్య కాకుండా ఇతర అభ్యర్థిని బరిలోకి దించాలని కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచిస్తోంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, సర్వే సత్యనారాయణ పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటిలో ఎవరు బరిలో నిలుస్తారనే తేలిపోనుంది.