వరంగల్ లో భట్టివిక్రమార్క పర్యటన 

వరంగల్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు సీఎంలు అధికారం అడ్డుపెట్టుకుని ఆటలాడుతున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల్లో చంద్రులు అధికారంలోకి రావడం… ప్రజల దురదృష్టమని చెప్పారు. ఆరు దశాబ్ధాల పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణ నలుగురు గుంటనక్కల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దే అధికారమని స్పష్టం చేశారు.