వరలక్ష్మీవ్రతం ఆచరణ..సకల సంపదల హేతువు


తిరుమల,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : భారతీయ సంప్రదాయంలో వరలక్ష్మీ వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించి లక్ష్మీదేవిని పూర్తి ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి మందు వచ్చే శుక్రవారం రోజున ఆచరిస్తారు. మహిళలు ప్రత్యేకంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. తమ మాంగల్యం పటిష్టంగా ఉండాలి, అష్టయిష్వర్యాలు దక్కాలని కోరుకుంటూ లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే ఆనందం, శాంతి ఉండాలంటూ ఉపవాసం పాటిస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మహిళలు తమ కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలంటూ చేసే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ చర్యలను అనుసరించండి. వీటిని చేయడం వలన ఇంట్లో ఎప్పుడూ ఐశ్వయర్యం తాండవిస్తుందని నమ్మిక. పంచాంగం ప్రకారం శ్రావణ శుక్రవారం ఆగస్టు 16వ తేదీన వస్తోంది. ఈ రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీ దేవి పసుపు కొమ్ములను ఇష్టపడుతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో వరలక్ష్మీ వ్రతం రోజున ఉదయం స్నానం చేసి లక్ష్మీ దేవిని పూజించి, లక్ష్మీ దేవి పాదాల వద్ద 11 పసుపు కొమ్ములను సమర్పిస్తారు. కలశం స్థాపించి
పూజ నిర్వహిస్తారు. కొంత సమయం తరువాత గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి, వాటిని అల్మారాలో లేదా భద్రంగా ఉంచండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల సంతోషం, ఐశ్వర్యం, సంపదలు పెరుగుతాయని నమ్ముతారు. ఎవరైనా జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవిని పూజించండని సలహా ఇస్తారు. ఈ సమయంలో, జీవితంలో ఆనందం, శాంతి కోసం ప్రార్థించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమై ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయని నమ్ముతారు.
అప్పుల బాధ నుంచి బయటపడేందుకు వరలక్ష్మీ వ్రతం రోజున తీసుకునే చర్యలు మేలు చేస్తాయి. ఈ రోజున లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని నియమ నిష్టలతో పూజించి, లక్ష్మీ దేవికి బియ్యం, బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. ఇలా పూజించడం ద్వారా సాధకుడు రుణ విముక్తి పొందుతాడని నమ్ముతారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంతానం, ఐశ్వర్యం కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. వరలక్ష్మి ఉపవాసం ఉండాలంటే ఉదయాన్నే శుభ సమయంలో ఇంట్లో శ్రీ యంత్రాన్ని ప్రతిష్టించి పూజలో పాల్గొంటారు.వరలక్ష్మీ వ్రతం రోజున ముత్తయిదువులకు తాంబూలాలు ఇస్తారు. దీంతో ఆ ఇంట్లో ప్రజల కోరికలన్నీ నెరవేరి సుఖ సంతోషాలు నెలకొంటాయని విశ్వసిస్తారు.