వాజ్‌ షరీఫ్‌కు మరో ఎదురుదెబ్బ

కరాచీ, జూన్‌30(జ‌నం సాక్షి) : పనామా పత్రాల కేసులో అనర్హత వేటు పడి ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవి కోల్పొయిన నవాజ్‌ షరీఫ్‌కు మరో దెబ్బ తగలనుంది. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌లో ఎన్‌ అనే పేరు కోల్పొయే ప్రమాదం ఉంది. సుప్రీం కోర్టు ద్వారా అనర్హతకు గురైన వ్యక్తి పేరుపై రాజకీయ పార్టీ ఉండరాదంటూ అవావిూ తెహ్రిక్‌ నేత దాఖలు చేసిన ఫిర్యాదుపై మాజీ ప్రధాని షరీఫ్‌కు ఈసీ నోటీసులు పంపింది. వచ్చేనెల 9న హాజరు కావాలని లా¬ర్‌లోని ఆయన నివాసానికి పంపిన నోటీసులలో పేర్కొంది. వచ్చే నెల 28న సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ సమన్లు పంపడం ప్రాధాన్యం సంతరించుకోంది. అనర్హత వేటు పడిన తరువాత కూడా పార్టీ ఛైర్మన్‌గా నవాజ్‌ కొనసాగేలా పీఎంఎల్‌ ఎన్‌ రాజ్యాంగ సవరణ చేపట్టగా ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టులో సవాలు చేశాయి. రాజ్యంగంలోని ఆర్టికల్‌ 62, 63 ప్రకారం అనర్హత వేటు పడిన వ్యక్తి పార్టీ అధ్యక్షునిగా కొనసాగరాదంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
————————