విఆర్ఏలకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

నెరడిగొండఆగస్టు3(జనంసాక్షి):
విఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని నిరవధిక నిరసన సమ్మె చేస్తున్న విఆర్ఎల వద్దకు బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జి అధ్యక్షుడు ఆడే గజేందర్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆడే వసంత్ రావు పార్టీ మండల నాయకులతో వెళ్లి విఆర్ఎలకు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వీఆర్ఏల సమస్యలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.వీఆర్ఎ పే స్కెల్,55సంవత్సరాలు పూర్తయిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు,ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడే గజేందర్, మండల పార్టీ అధ్యక్షుడు ఆడే వసంత్ రావు తోపాటు నాయకులు ప్రఫుల్ చంద్ రెడ్డి ఎల్లేటి రాజన్న సద్దాం తదితరులు పాల్గొన్నారు.