విఘ్నేశ్వరుడి కి ప్రత్యేక పూజలు.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్3.
మౌలాలి డివిజన్ లోని పూలపల్లి బాలయ్య కాలనీలో బిల్డర్ నరసింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని భజనలు,ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక ఆహ్వానితులను మండపం నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పిట్టల శ్రీనివాస్,ఆసర్ల శ్రీకాంత్,దుంబాల సత్తయ్య తదితర కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Attachments area