కేసీఆర్ కుటుంబానికి రేవంత్ ప్రభుత్వమే రక్షణ కవచం
` భారాసకు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని ప్రధానే చెప్పారు.
` అయినా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
` సీబీఐ విచారణ జరపాలని రాహుల్ చెప్పిన మాటలేమైనయ్?
` కుటుంబ పార్టీలకు బీజేపీ పూర్తి వ్యతిరేకం: కేంద్ర మంత్రి బండి
కరీంనగర్ బ్యూరో, జూన్ 22 (జనంసాక్షి) : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీపై విష ప్రచారం జరుగుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… ‘‘కాళేశ్వరం విషయంలో మోదీ చెప్పిన మాటలే బీజేపీ విధానం. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని చెప్పారు. ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలన్నదే మా డిమాండ్ ఇందులో మరోదానికి తావులేదు’’అని స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయమని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని రాహుల్ గాంధీ చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.2 లక్ష కోట్ల అంచనాలు పెంచిన కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందన్నారు. కాళేశ్వరంతో ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కాళేశ్వరంపై బీజేపీ స్టాండ్ మారిందని, బీఆర్ఎస్ తో కుమ్మక్కైందని కొంత మంది విష ప్రచారం చేస్తున్నారని ఈ విషయంలో బీజేపీ స్టాండ్ వెరీ క్లియర్ అని కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఆయనతోపాటు అమిత్ షా, జేపీ నడ్డా కూడా మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలన్నదే బీజేపీ విధానం. అంతేతప్ప ఊసరవెల్లి మాదిరిగా విధానాలు మార్చుకునే పార్టీ బీజేపీ కానే కాదు అని 11 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతూ నీతివంతమైన పాలన అందిస్తున్న మహానాయకుడు మోదీ ఏ ఆధారాల్లేకుండా కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని చెబుతారా? చెప్పరు కదా. మీరే ఆలోచించండి. అంతెందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పుడు నేను కేంద్ర మంత్రిని అయినా నా స్టాండ్ మారుతుందా? బీజేపీ స్టాండే నా స్టాండ్, కాళేశ్వరంపై బీజేపీ స్టాండ్ కు భిన్నంగా మా పార్టీ నాయకులు ఎవరూ మాట్లాడినా తప్పే. వాళ్ల విషయం హైకమాండ్ చూసుకుంటది. కాళేశ్వరం ముమ్మాటికీ పూర్తిగా అవినీతిమయమైన ప్రాజెక్టు. 38 వేల కోట్ల ప్రాజెక్టును 1.2 లక్షల కోట్ల అంచనాలు పెంచి కేసీఆర్ దోచుకున్నది ముమ్మాటికీ నిజం. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులే వందల కోట్లు సంపాదించారంటే, ఇగ కేసీఆర్ కుటుంబం ఏ స్థాయిలో అవినీతికి పాల్పడిరదో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కానేకాదు. సంయుక్తంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఈ రెండు పార్టీలు నాణేనికి బొమ్మాబొరుసులాంటివి. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రక్షణ కవచంగా మారారు. అందుకే కేసీఆర్ పై ఎన్ని అవినీతి ఆరోపణలున్నా, కేసులు పెట్టినా ఆయనను మాత్రం అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నారు. ప్రజలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కు రాజకీయాలు అర్ధమైనయ్. అందుకే ‘అందరికీ ఇచ్చాం అవకాశం…ఇక బీజేపీకి ఇద్దాం అధికారం’ అనే నిర్ణయానికి వచ్చారు. ఎన్డీఎస్ఏ అంటే ఏమనుకుంటున్నరు. కేసీఆర్ లెక్క తాగి ఏది పడితే అది రాసే సంస్థ కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం… పార్లమెంట్ ఆమోదించి ఏర్పాటు చేసిన అథారిటీ ఇది. ఎన్డీఎస్ స్వతంత్య్రపైనే బురద చల్లుతారా.? బీజేపీ కుటుంబ పార్టీలకు ముమ్మాటికీ వ్యతిరేకం. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటామని ఎందుకు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ లాంటి అవినీతి, కుటుంబ పార్టీని దరిదాపుల్లోకి కూడా రానీయం. కరీంనగర్ లో అర్హుల్కెన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందే. ముఖ్యంగా జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలకు సంబంధించిన ఫైలు విషయం పై కలెక్టర్ తో మాట్లాడిన. సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కమార్ రెడ్డితోనూ మాట్లాడి తప్పకుండా స్థలాలిచ్చేలా క్రుషి చేస్తా. అట్లాగే మిగిలిన అర్హుల్కెన జర్నలిస్టులందరికీ కూడా స్థలాలు ఇప్పించేందుకు యత్నిస్తా. బీజేపీ అధికారంలోకి వస్తే తప్పకుండా స్థలాలిచ్చే బాధ్యత తీసుకుంటా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.