పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
` కులం,మతం పట్టింపులేదు
` మంత్రి పొంగులేటి
నల్గొండ(జనంసాక్షి):నకిరేకల్: భారాస హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. మొదటి విడతలో తమ ప్రభుత్వం 4.50లక్షల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు.నల్గొండ జిల్లా నకిరేకల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘’ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు ఇస్తున్నాం. కులమతాలకు అతీతంగా కేటాయిస్తున్నాం. ఎన్నికల నాటికి పేదలకు 20లక్షల ఇళ్లు కట్టిస్తాం. లబ్ధిదారులకు 4 విడతల్లో రూ.5లక్షలు ఇస్తున్నాం. మధ్యవర్తులకు కాకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వేస్తాం. న్యాయమైన భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది’’ అని పొంగులేటి చెప్పారు.