విద్యాబాలన్ కు గౌరవ డాక్టరేట్

సినీరంగంలో సేవలకు తక్కువ కాలంలోనే పద్మశ్రీ అందుకున్న ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ తాజాగా గౌరవ డాక్టరేట్ పొందింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన రాయ్ యూనివర్సిటీ ఆమెకు ఈ పురస్కారం ఇచ్చింది. భారత సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారిని రాయ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరిస్తుంది. సినీ రంగంలో పదేళ్లు పూర్తయిన సందర్భంగా గౌరవ డాక్టరేట్ అందుకోవడం పట్ల విద్యాబాలన్ సంతోషం వ్యక్తం చేసింది.