విద్యాభివృద్ధికి రూ. 4 వేల కోట్లు: సీఎం

మహబూబ్‌నగర్‌: డబ్బు, ఆస్తులు,పదవులు శాశ్వతం కాదు విద్య మాత్రమే శాశ్వతమని ముఖ్యమంత్రి కారణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. ఉపకార వేతనాలు, బోధనా ఫీజుల కోసం ఏటా రూ.4 వేల కోట్ల ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సమాచార శాఖామంత్రి డి,కె.అరుణ, పలువురు ప్రజిప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.