విద్యార్థిపై దాడిచేసి చంపిన ఉపాధ్యాయుని కఠినంగా శిక్షించాలి దళిత యువజన సంఘం

వనపర్తి:ఆగస్టు15 (జనం సాక్షి) విద్యార్థిపై దాడి చేసి చంపిన ఉపాధ్యాయుని కఠినంగా శిక్షించాలని దళిత యువజన సంఘం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలో జలోర్ జిల్లాలోని సురానా గ్రామంలో ఇందర్ మెగ్వల్ అనే తొమ్మిదేళ్ళ దళిత బాలుడు తను చదువుతున్నా పాఠశాలలో ఉన్న మంచినీటి కుండలోని నీళ్ళు తాగడానికి వెళ్తే అదే పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుడు కులహాంకరం ప్రదర్శించి నీళ్ళు తాగనివ్వకుండ విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి చేయగా ఆ విద్యార్థి చికిత్స పొందుతూ మరణించడం జరిగిందని ఇలాంటి కులహాంకర దాడిని ఖండిస్తూ ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పిటిషన్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు చిరంజీవి నాగరాజు సురేష్ శ్రీకాంత్ రమేష్ రవి తదితరులు పాల్గొన్నారు.