విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ

చౌడాపూర్, ఆగస్టు 27( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామంలో ఫరూక్ నగర్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ సంతోష్ స్కూల్ లైబ్రరీ కోసం రూ.5 వేలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రాందాస్ నాయక్,గ్రామ సర్పంచ్ అనిత, ఎంపిటిసి చిలకల సత్యమ్మ, గ్రామ పంచాయతీ సెక్రెటరీ మహేష్ రెడ్డి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, గ్రామ పెద్దలు వెంకట్, చిలకల శంకర్, పులి రాములు,కిషన్ నాయక్,సంతోష్, హర్యానాయక్ మరియు విద్యార్థిని విద్యార్థులు తోటి ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.