విద్యార్థుల బస్ పాసులను ప్రభుత్వం ఉచితం చేయాలి


వీపనగండ్ల ఆగస్టు 03 (జనంసాక్షి) చదువుకునే ప్రతి విద్యార్థికి బస్సు పాసులను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని బిజేవైఎం వీపనగండ్ల మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ కోరారు. పేద విద్యార్థులను విద్యకు దూరం చేయరాదని ఎంతోమంది పేద విద్యార్థులు దూరం వెళ్లి చదువుకోవాలంటే కాలేజీ ఫీజులు, పెరిగిన బస్సు చార్జీలకు డబ్బులు లేక చదువుకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు అందుకే ప్రతి ఒక్క పేదవాడు చదువుకోవాలంటే ప్రభుత్వం విద్యార్థులకు బస్సు పాసులను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు