విద్యార్థుల ర్యాలీ

రాజోలి 13 (జనం సాక్షి)
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా రాజోలి లో శనివారం విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, జెడ్పీటీసీ సుగుణమ్మ, si లెనిన్ లు ర్యాలీ ప్రారంభించగా దేశ నాయకుల నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీ చేశారు. గ్రామ పంచాయతీ వరకు సాగిన ఈ ర్యాలీ లో గ్రామ పెద్దలు పాల్గొన్నారు