విద్యార్థుల వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచండి

రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ డైరెక్టర్ అలోక్ కుమార్

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 5 :

వసతి గృహ (హాస్టల్ )పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ డైరెక్టర్ హలోక్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల బిజ్వరమ్, ధరూర్ బీసీ హాస్టల్, గద్వాల బీసీ కాలేజీ హాస్టల్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ఉన్నందున హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు పౌష్టికహారం అందించాలని ఆదేశించారు. వంట గదులు తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు పరిశుబ్రంగా ఉంచాలని అన్నారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు…ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని శ్వేతా ప్రియదర్శిని, ఇందిర,హాస్టల్ వార్డెన్లు, తదితరులు పాల్గొన్నారు.