విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన

భీమదేవరపల్లి మండలం  ఆగస్టు(8) జనంసాక్షి న్యూస్
కేంద్రం నేడు పార్లమెంటు లో విద్యుత్ సవరన బిల్లును ప్రవేశ పెట్ట నున్న నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగ సంఘాల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ మేరకు సోమవారం నాడు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు హుస్నాబాద్ నియోజవర్గం భీమదేవరపల్లి మండలంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు ఉద్యోగుల జేఏసి పిలుపు మేరకు  కరెంటు సరఫరా నిలిచి పోయిన  అంతరాయం ఏర్పడిన తము సరి చేయబోమని విద్యుత్ సిబ్బంది తెలిపారు వినియోగదారులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో లైన్మెన్ ,దినేష్ ప్రకాష్, అనిల్, శ్రీనివాస్, రమేష్, శ్రీను,ఐలయ్య లక్ష్మీనారాయణ,ఆదిల్ తదితరులు పాల్గొన్నారు