విద్యుదాఘాతానికి కవలలు మృతి

వరంగల్: వరంగల్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ శివారు గుడితండాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యానికి దసరా ఒకరోజు ముందు ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. నరేష్, సురేష్ అనే ఇద్దరు కవల సోదరులు(14 ఏళ్లు) ఉన్న కొద్దిపాటి పొలానికి నీళ్లు పెట్టి తిరిగి వస్తున్నారు. ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో పొలంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ తీగలు తగిలి కవలలిద్దరూ మృతిచెందారు. కొన్ని రోజుల క్రితమే వీరి తల్లి మృతిచెందినట్లు సమాచారం.