విధిగా టిడి టీకా వేయించాలి

హెచ్ఈఓ షాబుద్దీన్

మునగాల, నవంబర్10(జనంసాక్షి): ధనుర్వాతం, డిప్తీరియా వ్యాధుల నుంచి పిల్లలను రక్షించడానికి బాలలు ప్రతి ఒక్కరు టీడీ (టెటనస్‌ అండ్‌ డిప్తీరియా) వ్యాక్సిన్‌ వేయించుకోవాలని హెచ్ఇఓ షాబుద్దిన్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలకు వ్యాక్సినేషన్ వేయడానికి వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నది. జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఐదు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు టీడీ వ్యాక్సినేషన్‌ వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, పాఠశాల ఉపాధ్యాయునిలు, విద్యార్థులు పాల్గొన్నారు.