విశాఖలో సిపిఐ వర్క్‌షాప్‌ ప్రారంభించిన రాజా

విశాఖపట్నం,అక్టోబర్‌8 (జనంసాక్షి) : సీపీఐ రాష్ట్ర స్థాయి వర్క్‌ షాప్‌ను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రస్తుత రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల ఉద్యమ కార్యాచరణపై చర్చ నిర్వహించనున్నారు.