విషమంగానే

..సింగపూర్‌ :
ఢిల్లీ అత్యాచార బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉందని సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రి వైద్యులు గురువారం వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మీడియాకు లేఖ విడుదల చేశారు. బాధితురాలు చికిత్సకు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఆమె కోలుకునేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని భారత హోం మంత్రిత్వ శాఖ ప్రకటన నేపథ్యంలో అందరూ ఆమె క్షేమంగా తిరిగి వస్తుందని ఆశించారు. కానీ చికిత్స స్పందించడం లేదంటూ వైద్యులు ప్రకటించడంతో
మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ వైద్యులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వైద్యులు ఆమెకు ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందిస్తున్నారు. ఎలాగైనా బాధితురాలిని రక్షించాలని ప్రయత్నిస్తున్నారు.