విస్ఫోటనం దిశగా సినాబంగ్ అగ్ని పర్వతం…

జకర్తా:ఇండోనేషియాలో సినాబంగ్ అగ్ని పర్వతం విస్ఫోటనం చెందే అవకాశం ఉండటంతో అలర్ట్ ప్రకటించారు. సుమత్రాలోని ఈ అగ్ని పర్వత పరిసర గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇంకా 10 వేల మందిని తరలించనున్నారు. దట్టమైన పొగ, బూడిద, రాయి దూళిని విరజిమ్ముతున్న సినబాంగ్ పర్వత బిలం దగ్గర లావా గోచరించిందని అబ్జర్వేషన్ స్టేషన్ చీఫ్ ఆర్మెన్ పుత్ర తెలిపారు. అగ్ని పర్వత పరసరాల్లో చిన్నపాటి భూప్రకంపనలు సంభవించాయని అక్కడి ఆర్మీ అధికారులు తెలిపారు. 2014లో ఈ అగ్ని పర్వతం పేలడంతో కనీసం 16 మంది చనిపోయారు.