వీఆర్ఏల డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం

   సిపిఐ మండల కార్యదర్శి అబ్రహం
వనపర్తి ఆగస్టు 8 (జనం సాక్షి) గ్రామ రెవెన్యూ సహాయకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని సిపిఐ మండల కార్యదర్శి అబ్రహం డిమాండ్ చేశారు.అమరచింత తహసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు చేస్తున్న నేరవాదిక దీక్షకు చేరుకొని వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా అబ్రహం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం వీఆర్ఏల డిమాండ్ల నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని 55 సంవత్సరాల నుండి విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని అలాగే పెన్షన్స్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు శ్యాంసుందర్ దేవరాజ్ సౌలు లక్ష్మణ్ మునిస్వామి నారాయణ గాయత్రి శ్రీను వెంకట్ అన్న గోవర్ధన్ రవి పాల్గొన్నారు.