వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి

మోత్కూరు ఆగస్టు 11 జనంసాక్షి : మోత్కూరు మండల కేంద్రంలో గత 18 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు మద్దతు తెలుపుతూ వారికి కొండగడప మాజి ఎంపీటీసీ ఎర్రవెల్లి పద్మ నరసయ్య గురువారం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు నిరాహార దీక్షను ఉద్దేశించి మాట్లాడుతూ వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందని వారి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆదేశాల మేరకు పూర్తి మద్దతు తెలియజేస్తూ వారి సమస్యలు పరిష్కరించాలని సమ్మెలో పాల్గొన్నారు.