వీఆర్ఏల సమస్యలు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు…

– ఊరుకొండ మండల వీఆర్ఏలు.
ఊరుకొండ, జూన్ 28 (జనం సాక్షి):
ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, హామీలు అన్ని నెరవేరేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని ఊరుకొండ మండల వీఆర్ఏలు సత్తయ్య, రమేష్, శేఖర్, నిరంజన్, శ్రీలత, యాదమ్మ, సుల్తాన్, యాదయ్య, దశరతం, తదితరులు డిమాండ్ చేశారు. గురువారం వీఆర్ఏలు చప్పట్లు కొడుతూ వినూత్న రీతిలో నిరసన దీక్ష చేపట్టారు. వీఆర్ఏలు మాట్లాడుతూ వీఆర్ఏ లకు పే స్కేల్ జీవోను వెంటనే చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఊరుకొండ మండల వీఆర్ఏలు సత్తయ్య, రమేష్, శేఖర్, నిరంజన్, శ్రీలత, యాదమ్మ, సుల్తాన్, యాదయ్య, దశరతం, తదితరులు పాల్గొన్నారు