వీఆర్ఏ పే స్కేల్ అమలు చేయాలని గద్వాలలో ధూమ్ ధామ్

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 20 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం లోని ఆర్డీవో ఆఫీస్ నుండి గద్వాల పట్టణంలో పురవీధుల గుండా వీఆర్ఏలు పే స్కేల్ అమలు చేయాలని శనివారం ధూమ్ ధామ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వీఆర్ఏలు బతుకమ్మ ,బోనాల, పోతురాజు, పులి ఎలుగుబంటు వేషధారణలతో వినూత్నమైన రీతిలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ సమస్యలు తీర్చే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ర్యాలీలతో , ప్రభుత్వ వివిధ పనులను స్తంభింప చేస్తామని, తమ సమస్యలు పరిష్కరించే దాకా తమ పోరాటం ఆగదని, తమ పోరాటం ఏదో రూపకంగా చేస్తూనే ఉంటామని, ఇప్పటికైనా కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గద్వాల జోగులాంబ జిల్లా వి ఆర్ ఎ ల జేఏసీ నాయకులన్నారు.