వెనువెంటనే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌

కోల్‌కతా : భారత్‌తో జరగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 8 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో అశ్విస్‌ బౌలింగ్‌లో కుక్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన ట్రోట్‌ ఓజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం పీటర్సన్‌ అశ్విస్‌ బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండా పెవీలియన్‌ చేరాడు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 247 పరుగులకు ఆలౌట్‌ అయింది.