వైకాపాలో చేరిన మాజీ ఐపిఎస్‌ ఇక్బాల్‌

ఏలూరు,మే16(జ‌నం సాక్షి):మాజీ ఐపిఎస్‌ అధికారి ఇక్బాల్‌ బుధవారం వైసిపిలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం జోగన్నపాలెంలో వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే పదవీవిరమణ పొందిన ఆయన రాజకీయాల్లో రావాలని నిర్ణయించుకున్నారు. రాయలసీమకు చెందిన ఇక్బాల్‌ గతంలో ఉమ్మడి ఎపిలో సిఎం చంద్రబాబు చీప్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. రాయలసీమ ఐజీ గా కూడా షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ పనిచేశారు.  ఆయనకు ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి…కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఇక్బాల్‌ ఉమ్మడి ఆంధప్రదేశ్లో పలు కీలక పదవులను నిర్వహించారు. పీఏసీ ఛైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తదితర నాయకులు ఇక్బాల్‌ను తీసుకుని పార్టీ అధ్యక్షుడి వద్దకు తీసుకుని వచ్చారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఆయన దెందులూరు శివారు నుంచి 163వ రోజు పాదయాత్రను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పశ్చిమకు చెందిన మాజీ ఎమ్మెల్యే కారుమూరి
నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
—–