వైభవంగా వరలక్ష్మి వ్రత మహోత్సవం

పెబ్బేరు ఆగస్టు 5 ( జనంసాక్షి ):
శ్రావణ శుద్ద అష్టమి శ్రావణ రెండవ శుక్రవారం పురస్కరించుకుని పెబ్బేరు పట్టణంలో  శ్రీ షిరిడి ఆలయంలో షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో,అయ్యప్పస్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో అర్చకులు నవీన్ కుమార్ ఆచార్యులు సామూహిక  వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో గణపతి, గౌరీ పూజ సహితంగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన కార్యక్రమం, మహిళలచే సామూహిక వరలక్ష్మి  వ్రతం అనంతరం  అమ్మవారికి నైవేద్య సమర్పణ ఆడపడుచులు కంకణ ధారణ మహామంగల నీరాజనం, తీర్థ ప్రసాదముల వితరణ అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎద్దుల కరుణశ్రీసాయినాథ్ , వైస్ ఛైర్మన్ కర్రెస్వామి, వేమారెడ్డి, కౌన్సిలర్లు మేకల సుమతి ఎల్లయ్య ,పార్వతి, చిన్న ఎల్లారెడ్డి, కిషోర్,  హన్మంత్ రెడ్డి, దరూర్ శ్రీనివాసులు, మేకల ఎల్లయ్య, ఎ. శ్రీనివాస్ రెడ్డి, ఇ. శ్రీధర్ ,బాలరాజు,వీరాబోజ చారి, బాలవర్ధన్, శ్రీనాథ్,వెంకటేశ్వర్ రెడ్డి,రమేష్,శ్రీనివాస్ గౌడ్, సహాదేవ్, సతీష్, విజయకుమార్, అంజి, ప్రేమ్ కుమార్ షిరిడి సాయి సేవా సమితి సభ్యులు, అయ్యప్పస్వామి సేవా సమితి సభ్యులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.