వోల్డ్‌ సిటీ కాదు.. అది వర్జినల్‌ సిటీ

` 2029 నాటికి పాతబస్తీకి మెట్రోరైలు మార్గం నిర్మించి తీరుతాం
` ఆ తర్వాత అదే రైల్‌లో అక్బరుద్దీన్‌ ఒవైసీతో కలిసి ఓల్డ్‌ సిటీకి వెళ్తా
` గత పాలకుల నిర్లక్ష్యం వల్లే వెనుకబాటు
` అవసరమైతే అక్బరుద్దీన్‌ను కొండగల్‌లో గెలిపిస్తా
` డిప్యూటి సీఎంను చేస్తా: సీఎం రేవంత్‌
` అవినీతికి పరాకాష్ట కేసీఆర్‌ పాలన
` పదేళ్లలతో దోపిడీ చేయని రంగం లేదు
` గొర్రెల స్కాం, కేసీఆర్‌ కిట్లు, బతుకమ్మ చీరల్లో స్కాం
` గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి
` అబద్దాలతో సభను ఇంకా తప్పుదోవ పట్టించలేరు
` అసెంబ్లీతో ఘాటుగా స్పందించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్‌(జనంసాక్షి): హైదరాబాద్‌: రెండో దశ మెట్రో నిర్మాణానికి నిధులు కోరితే కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ పాతబస్తీకి మెట్రో రైలు అంశాన్ని లేవనెత్తారు.ఎప్పటిలోగా మెట్రో రైలు నిర్మాణం చేపడతారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘’ పాతబస్తీ మెట్రో నిర్మాణాన్ని గత ప్రభుత్వమే నిర్లక్ష్యం చేసింది. మెట్రో నిర్మాణంపై ఎల్‌అండ్‌టీతో చర్చలు జరుపుతున్నాం. హైటెక్‌ సిటీ నుంచి ఎయిర్‌పోర్టుకు గత ప్రభుత్వం టెండర్లు పిలిచింది. స్థిరాస్తి సంస్థల భూముల ధరలు పెంచేందుకే ఆ మార్గంలో మెట్రో అన్నారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ నుంచి ఎయిర్‌ పోర్టుకు మంచి రోడ్లు ఉన్నాయి. మెట్రో అవసరం లేని మార్గాల్లో నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఈ ప్రభుత్వం ఎల్బీనగర్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో నిర్మించనుంది. పాతబస్తీ ప్రజలకు మేలు కలిగేలా చాంద్రాయణగుట్ట విూదుగా మెట్రో రైలు నిర్మాణం చేపడతాం. 78 కి.విూ మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదిక ఇచ్చాం. పాతబస్తీ, ఎయిర్‌పోర్టుకు మెట్రోను కచ్చితంగా నిర్మించి తీరుతాం. రెండో దశకు ఇప్పటికే భూ సేకరణ మొదలుపెట్టాం.తెలంగాణకు నిధుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోంది. నిధులన్నీ యూపీ, బిహార్‌, గుజరాత్‌కే కేటాయిస్తున్నారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని బహిరంగసభ వేదికగా మోదీకి చెప్పాను. రాష్ట్రాల పట్ల పెద్దన్నలాగా వ్యవహరించాలని కోరా. ప్రధానిని పెద్దన్న అని సంభోదించటంలో తప్పేముంది. రాష్ట్రానికి నిధులు సాధించటం కోసమే పెద్దన్న అని సంబోధించాను.ఫెడరల్‌ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవాల్సిందే. చేయాల్సిన ప్రయత్నాలు పూర్తిగా చేయాల్సిందే. వాళ్లు ఇవ్వనంత మాత్రాన రాష్ట్రాభివృద్ధి ఆగదు. చాలా ఫైనాన్షియల్‌ సంస్థలు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. 2029 ఎన్నికల నాటికి పాతబస్తీకి మెట్రోరైలు నిర్మించి అదే మెట్రో రైల్‌లో అక్బరుద్దీన్‌ ఒవైసీతో కలిసి ఓల్డ్‌ సిటీకి వెళ్తా’’ అని సీఎం అన్నారు. పాతబస్తీని ఇస్తాంబుల్‌ చేస్తామని, వరంగల్‌ను లండన్‌గా మారుస్తామని, కరీంనగర్‌ను న్యూయార్క్‌ చేస్తామని అబద్ధాలు చెప్పి మోసం చేయబోమని వ్యాఖ్యానించారు.
అవినీతికి పరాకాష్టగా కెసిఆర్‌ పాలన
అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చి సందర్భంగా హరీష్‌ రావు వ్యాఖ్యలకు సిఎం రేవంత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. గత బిఆర్‌ఎస్‌ సర్కార్‌ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ అన్ని రంగాల్లో అవినీతి చేసిందని అసెంబ్లీలో మండిపడ్డారు. గొర్రెల స్కాం, కేసీఆర్‌ కిట్లు, ఆఖరుకు ఆడ బిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరల్లోనే స్కాం చేశారని విమర్శించారు. ఇంత జరిగినా సభలో మాజీ మంత్రి హరీశ్‌… ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కౌంటర్‌ ఇచ్చారు. ఇలా తప్పుడు లెక్కలు చెప్తేనే ఎంపీ ఎన్నికల్లో ప్రజలు గుండుసున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లాలో భూములను కొల్లగొట్టి..చేవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేసి..సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు.భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్‌రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదు. భారాస హయాంలో రూ.లక్షల కోట్ల విలువైన ఓఆర్‌ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మారు. పదేళ్లలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. కేసీఆర్‌ పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకున్నారు. బతుకమ్మ చీరలు అని చెప్పి సూరత్‌ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. హరీశ్‌ నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిండు సభలో అబద్దాలు మాట్లాడితే సహించమోన్నారు. మోటార్లకు విూటర్లు పెడుతామని 2017లో అప్పటి ప్రభుత్వం ఒప్పుకుంది నిజం కాదా..అని ప్రశ్నించారు. ఆధారాలతో సహా డాక్యుమెంట్లను హరీశ్‌ కు ఇస్తున్నామని చెప్పారు. అబద్దాలను రికార్డ్‌ల నుంచి తొలగించకుంటే కొత్త సభ్యులు నిజమనుకుంటారని అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని మండి పడ్డారు. సభలో సభ్యులు తప్పు మాట్లాడితే సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా తనపై ఉందన్నారు రేవంత్‌.. ప్రతిపక్షానికి తగిన సమయం ఇచ్చామన్నారు. మంత్రి కోమటిరెడ్డి అన్నట్లు హాఫ్‌ నాలెడ్జ్‌ ..కెసిఆర్‌ది ఫుల్‌ నాలెడ్జ్‌ అంటూ చేయిచూపుతూ ఎద్దేవా చేశారు. హరీష్‌ రావు సభను సభ్యులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మోటార్లకు విూటర్ల విషయంలో వాళ్లేదో కేంద్రంతో నిలబడి కొట్లాడినట్లు మాట్లాడుతున్నరు. ఇది అబద్ధం… వారి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి సభలో బుకాయించడం సరికాదు. ఈ విషయంలో రికార్డులను సవరించాల్సిన అవసరం ఉంది. విూటర్ల విషయంలో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సభ ముందు ప్రవేశపెడుతున్నా. ఆరు నెలల్లో డిస్టిబ్య్రూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ వద్ద విూటర్లు బిగిస్తామని 4 జనవరి 2017న ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంపై అధికారులు అజయ్‌ మిశ్రా, రఘుమా రెడ్డి, ఏ.గోపాల్‌ రావు సంతకం పెట్టారు. మోదీ ప్రభుత్వంతో ఆనాడు ఆరు నెలల్లోగా డిస్టిబ్యూష్రన్‌ ట్రాన్స్ఫార్మర్స్‌కు విూటర్లు బిగిస్తామని కేసీఆర్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. సభలో నోరు
తెరిస్తే అబద్దాలు మాట్లాడుతున్న హరీష్‌ రావు.. వారి హయాంలో జరిగిన ఒప్పందాలను చదువుకుని మాట్లాడాలని సూచించారు. అబద్దాలతో హరీష్‌ రావు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారన్నారు. ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే వారు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పారు. ’ప్రజలు శిక్షించినా వాళ్ల ఆలోచన మారలేదు.. అదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. లక్షల కోట్ల విలువైన ఔటర్‌ రింగ్‌ రోడ్డును రూ.7వేల కోట్లకే తెగనమ్మారు. గొర్రెల స్కీం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారు. గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. ఆడబిడ్డల సెంటిమెంట్‌ నూ దోపిడీకి ఉపయోగించు కున్నారు. కురుమ, యాదవుల సోదరులను అమాయకులను చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. కాళేశ్వరం ఖర్చు విషయంలోనూ గతంలో ఒకటి చెప్పి…ఇప్పుడు రూ.94వేల కోట్లు అని చెబుతున్నారు. ఆని పైర్‌ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని భూములు అమ్మిందో లెక్కలు తీద్దామా అని సవాల్‌ చేశారు. ’విూరు ఎన్ని వేల కోట్ల విలువైన భూములు అమ్మారో లెక్క తీద్దాం. అప్పుల లెక్కలు చెబుతున్నారు… కానీ అమ్ముకున్న లెక్కలు చెప్పడంలేదు. పదేళ్లయినా పాలమూరుకు చేసిందేం లేదు. 20లక్షల కోట్లకు పైగా ఖర్చుపెట్టినా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం వీళ్లు కాదా? రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా… రంగారెడ్డి జిల్లాపై నిర్లక్ష్యం వహించారు. రంగారెడ్డి జిల్లా ఆస్తులు అమ్ముకున్నారు కానీ జిల్లాకు సాగు నీరు ఇవ్వలేదు. ప్రజలు బీఆరెస్‌ కు గుండుసున్నా ఇచ్చినా బుద్ధి మారకుండా ఇలా మాట్లాడటం సరైంది కాదు. అని రేవంత్‌ సూచించారు. బీఆర్‌ఎస్‌ నిజాయితీ పాలన అందించి ఉంటే… బతుకమ్మ చీరలు, కేసీఆర్‌ కిట్స్‌, గొర్రెల పంపిణీ పై విచారణకు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలని రేవంత్‌ రెడ్డి సవాల్‌ చేశారు. ఇకపోతే తెలంగాణలో లా అండ్‌ ఆర్డర్‌ దెబ్బతిందని హరీశ్‌ రావు అన్నారు. 8 నెలల్లో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్‌ లో కేటాయింపులు లేవన్నారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో మర్డర్లు, రేప్‌ లు జరిగాయని..లా అండ్‌ ఆర్డర్‌ ను కాపాడాలని కోరారు హరీశ్‌ రావు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్బాబు లేచి ఘాటుగా స్పందంచారు. పట్టపగలు పెద్దపల్లి జిల్లాలో లాయర్‌ దంపతులను చంపితే దిక్కు లేదని , విూరా శాంతిభద్రతల గురించి మాట్లాడేదని అన్నారు.