వ్యక్తిగత కారణాలతోనే ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఎంపీ సుధారాణి

వరంగల్‌ : వ్యక్తిగత కారణాల వల్లే ఎఫ్‌డీఐల ఓటింగ్‌కు హజరుకాలేకపోయారని తేదేపా ఎంపీ గుండు సుధారాణి తెలిపారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలిసి సంజాయిషీ ఇచ్చేందుకు ఆమె బైంసా బయలుదేరారు. కాంగ్రెస్‌లో లాలూచి పడాల్సిన అవసరం తమకు లేదన్నారు.