వ్యక్తిగత పరిశుభ్రతతోనే చిన్నారుల్లో నులిపురుగులను నివారించవచ్చు

యాచారం జెడ్పిటిసి చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం ,(జనం సాక్షి) వ్యక్తిగత పరిశుభ్రత తోనే చిన్నారుల్లో నులి పురుగులను నివారించవచ్చని యాచారం జడ్పిటిసి చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య తెలిపారు. గురువారం నాడు యాచారం మండల పరిధిలోని మాల్ గ్రామంలో  ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నూలి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయడం జరిగింది. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలను చెదిస్తారని ఆరోగ్యమే మహాభాగ్యమైన సూత్రాన్ని పాటించాలని నులి పురుగు నివారణ కోసం విద్యార్థులకు మందులు పంపిణీ చేసి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Attachments area