వ్య‌భిచారం ముఠా అరెస్టు గద్వాల టౌన్ ఎస్సై హరిప్రసాద్ రెడ్డి.

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 7 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ‌ముఠాను ఆదివారం గద్వాల టౌన్ పోలీసులు పట్టుకున్నారు. గద్వాల టౌన్ ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాలిలా ప్రకారము
గద్వాల పట్టణం బీరెల్లు రోడ్డులో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం గద్వాల టౌన్ ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు అకస్మికంగా దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్నా నిర్వాహకులు ఓంగోలుకు చెందిన రమాదేవి, విజయవాడకు చెందిన సాంబశివరావుతో పాటు విటులు చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన ఎండి ఫరూఖ్, ఎండి సొహెల్ లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.