శరన్నవరాత్రి ఉత్సవాలకు 35 వేల ఆర్థిక సహాయం.

శరన్నవరాత్రి ఉత్సవాలకు 35 వేల ఆర్థిక సహాయం

తాండూరు అక్టోబర్ 17(జనంసాక్షి) పట్టణ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో కొలువు
దీరిన తుల్జా భవాని మాత ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ 35వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.మంగళవారం తుల్జా భవాని మాత ఆలయ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మనన్ వర్త్య విఠల్ నాయక్ ను కలిసి దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. .దీంతో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య
విటల్ నాయక్ కమిటీ సభ్యులకు 35వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రజలకు భవాని మాత చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.అదేవిధంగా
పట్టణ ప్రజలకు భవాని మాత ఆశీస్సులు నిరంతరం ఉండాలనిభవాని మాత ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ,సూపర్వైజర్ రాజు ,అంజిలప్పఎం. శ్రీనివాస్, గోపాల్, తులసిరాం, ప్రభాకర్ ,ఆశప్ప,పారేష్ ,జిల్ పాషా,తదితరులు ఉన్నారు.